ఏషియన్‌ ఖోఖో చీఫ్‌ రిఫరీగా శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ ఖోఖో చీఫ్‌ రిఫరీగా శ్రీనివాసరావు

Mar 19 2023 2:18 AM | Updated on Mar 19 2023 2:18 AM

- - Sakshi

కిర్లంపూడి: అస్సాంలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించే ఏషియన్‌ ఖోఖో చాంపియన్‌షిప్‌ పోటీలకు కిర్లంపూడికి చెందిన కర్రి శ్రీనివాసరావు చీఫ్‌ రిఫరీగా ఎంపికయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి కె.పట్టాభిరామ్‌ ఈ విషయం తెలిపారు. శ్రీనివాసరావు కిర్లంపూడి యంగ్‌మెన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ పూర్వ క్రీడాకారుడు కూడా. ఆయనను క్లబ్‌ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, తూర్పు గోదావరి జిల్లా ఖోఖో సంఘం ఉపాధ్యక్షుడు చదలవాడ బాబి, సర్పంచ్‌ మహేంద్రాడ శ్రీలత తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement