
ఆవాజ్ మహాసభలను జయప్రదం చేయండి
ఆత్మకూర్: ఆవాజ్ సంఘం మూడో మహాసభలు జులై 13, 14 తేదీల్లో గద్వాలలో కొనసాగుతాయని.. అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర నాయకులు జబ్బార్, మహమూద్, గయాసుద్దీన్ కోరారు. గురువారం పట్టణంలోని ఎంజీ గార్డెన్స్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం జరిగే మహాసభలకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ గనీ, ఖాజాపాషా, షాహీద్, బట్టి పాషా, ఇస్మాయిల్, యూనీస్, ఖలీల్ అహ్మద్, ఇస్మాయిల్, బషీర్, సుల్తాన్, జబ్బార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.