
లక్ష్యం మేర రైతులకు రుణాలివ్వాలి
గద్వాల: ఈ ఏడాది 2025–26 సంవత్సరానికి గాను జిల్లాకు వార్షిక రుణప్రణాళిక రూ.6,472.29కోట్లు నిర్ధేశించినట్లు, లక్ష్యం మేర రైతులకు పంటరుణాలను అందజేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు రుణాలను బ్యాంకర్లు అందించాలని ప్రధానంగా ఉపాధి, యూనిట్ల స్థాపన, చిన్న, మధ్యతరహా, విద్యా, గృహ సంబంధ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రుణాలను అర్హులైన వారికి మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా పంటరుణాలు వ్యవసాయ మౌళిక వసతుల రుణాల మంజూరీలో వేగం పెంచాలన్నారు. వ్యవసాయానికి ఉపయోకరంగా ఉన్న ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు వంటి వాటికి రుణాలు అందించాలన్నారు. అదేవిధంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద జిల్లాలో మంజూరైన 18యూనిట్లకు 35శాతం చొప్పున రాయితీ డబ్బులను రూ.27.60లక్షలను వెంటనే చెల్లించాలన్నారు. చిన్నచిన్న వ్యాపార యూనిట్లుకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించాలని, ప్రతిబ్యాంకులో అన్ని రంగాలకు కలిపి అర్హులైన వారికి 75శాతంపైగా రుణాలు మంజూరీ చేయాలన్నారు. ఈ ఏడాది రుణప్రఽణాళిక గతేడాది కంటే రూ.1221.21కోట్లను ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు. ఇందులో అధికంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4945.14కోట్లు, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు రూ.606కోట్లు, ప్రాధానేతర రంగాలకు రూ.192.84కోట్లు, విద్యరుణాలు రూ.16.80కోట్లు, గృహరుణాలు రూ.124.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎల్డీఎం శ్రీనివాస్రావు, నాబార్డ డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్బీఐ ఏటీఎం చేతన్, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వర్గౌడ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సోలార్ పవర్ప్లాంట్ పనుల పరిశీలన
కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న సోలార్ పవర్ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన పనులతీరును పరిశీలించారు. కలెక్టరేట్లో వాహనాల పార్కింగ్ కోసం 39.5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈషెడ్ వాహనాలు నిలిపేందుకు అనుకూలంగా నిర్మించాలన్నారు. సోలార్తో కూడిన షెడ్నిర్మాణం చేపట్టడం ద్వారా విద్యుత్తు వినియోగ వ్యయం కూడ ఆదా అవుతుందన్నారు.
బ్యాంకర్లకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశం
వార్షిక రుణప్రణాళిక
రూ.6,472.29 కోట్లుగా నిర్దేశం