ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పెంపు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పెంపు

Jun 21 2025 3:59 AM | Updated on Jun 21 2025 3:59 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పెంపు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పెంపు

గద్వాల: ప్రజల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని అక్రమ లేఅవుట్లను 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పెంచిందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సంతోష్‌ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు కట్టి 19,485 మంది సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. https//lrs.telangana. gov.in ద్వారా నేరుగా తమ దరఖాస్తులు సరిచూసుకొని ఫీజు చెల్లింపు చేయవచ్చని, ఫీజు కట్టిన వారికి L1,L2,L3 లాగిన్‌ లలో వెరిఫికేషన్‌ చేసి వెంటనే ప్రొసీడింగ్‌ కూడా జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్లాట్‌ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement