నట్టేట ముంచి | - | Sakshi
Sakshi News home page

నట్టేట ముంచి

May 27 2025 12:19 AM | Updated on May 27 2025 12:19 AM

నట్టే

నట్టేట ముంచి

జోగుళాంబ గద్వాల
నమ్మించి..

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025

వివరాలు 8లో u

దళారులను నమ్మొద్దు

జిల్లాలోని రైతులు ఎవరూ భూ సమస్యలపై మధ్య దళారులను ఆశ్రయించొద్దు. చట్టబద్దంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అంటే అక్కడ ఖచ్చితంగా మోసం జరుగుతుందని గ్రహించాలి. పలు సాంకేతిక సమస్యల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. మోసపోయిన రైతుల విషయంలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు, ఎస్పీ

ప్రభుత్వ భూములపై

దళారుల నజర్‌...

గద్వాల – అలంపూర్‌ సెగ్మెంట్‌లలో సీలింగ్‌, వక్ఫ్‌, దేవాదాయ, ప్రభుత్వ భూములు ఉండగా.. వీటిని సైతం దళారులు, భూకబ్జాదారులు రెవెన్యూలోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకొని పట్టా భూములుగా మార్చుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నాయి. భూ బాదలాయింపు జరగాల్సి ఉంటే అట్టి భూములను వారుసుల పేరిట రెవెన్యూ రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ప్రభుత్వ భూములు సైతం దళారుల చేతివాటంతో రికార్డులు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా అలంపూర్‌, గట్టు, కేటీదొడ్డి, వడ్డేపల్లి, అయిజ, గద్వాల, మానవపాడు మండలాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటున్న దళారులు రైతులను నమ్మించి దోచుకుంటున్నారు.

గద్వాల క్రైం: భూ సమస్యలు.. పాసు బుక్కులు.. ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు.. తదితర సమస్యలను పరిష్కరించాలని రైతులు అటు అధికారులకు వినతులు.. ఇటు ప్రజావాణి.. ప్రజాదర్భార్‌లో దరఖాస్తులు చేస్తుంటారు. ఇలాంటి బాధితులనే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. భూములకు సంబంధించి ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని నమ్మబలుకుతున్నారు. వీరి మాటలు నమ్మిన రైతులు రూ.లక్షలు వారికి అందజేయడం.. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటనలు జిల్లాలో కో కొల్లలుగా ఉన్నాయి.

జిల్లాలో కొన్ని సంఘటనలు..

గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళా రైతు పేరుపై 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రెవెన్యూ రికార్డులో పేరు నమోదు కాలేదు. ఈ క్రమంలో ఆమెతోపాటు అతని సోదరుడు హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజాదర్భర్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడే ఓ దళారీ నేను ఓఎస్‌డీలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ నమోదు చేయించేందుకు ఈ ఏడాది మార్చిలో రూ.1.45క్షలు వసూలు చేశాడు. అయితే నెల రోజులైనా ఎలాంటి ఫలితం లేక పోయింది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి 24.05.2025 తేదీన హైద్రాబాద్‌కు చెందిన దళారీపై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

● గద్వాల పట్టణానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి గద్వాల మండలంలోని పరుమాలలో ఉంది. అయితే అక్రమార్కులు ఆ భూమిపై నకిలీ పాసుబుక్కులు సృష్టించి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను పొందుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో న్యాయం కోసం ఫిర్యాదు చేయగా కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే రైతుకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని 26.5.2025 తేదీన కలెక్టర్‌, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో రైతు రూ.4లక్షలు దళారులకు ఇచ్చి మోసపోయాడు.

● రాజోళి మండలానికి చెందిన ఓ రైతు తన రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పాసుబుక్కుల కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. వివిధ సమస్యల కారణంగా పాసుబుక్‌ల జారీ ఆలస్యమైంది. దీంతో రైతు గద్వాలకు చెందిన ఓ దళారీని ఆశ్రయించాడు. అందుకు రూ.50వేలు ఒప్పందం చేసుకున్నాడు. ఆరు నెలలు అయినా దళారీ పాసుబుక్కు ఇప్పించడం లేదని 17.3.2025 తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎంతో మంది రైతులు భూసమస్యలపై రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, సమస్యల పరిష్కారం లేకపోవడంతో దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు.

న్యూస్‌రీల్‌

అమాయక రైతులే లక్ష్యంగా

దోచుకుంటున్న మధ్య దళారులు

భూ వివాదాలు పరిష్కరిస్తామని.. పాసుబుక్కులు ఇప్పిస్తామని

బుకాయింపు

రూ.లక్షలు వసూలు చేసి మొఖం

చాటేస్తున్న వైనం

పట్టణ పోలీసు స్టేషన్‌లో తాజా కేసు నమోదుతో వెలుగులోకి..

నట్టేట ముంచి 1
1/3

నట్టేట ముంచి

నట్టేట ముంచి 2
2/3

నట్టేట ముంచి

నట్టేట ముంచి 3
3/3

నట్టేట ముంచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement