
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
ధరూరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని, రైతులు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పేస్ 1 నుంచి పంపుహౌస్ను ఎమ్మెల్యే హాజరై గంగమ్మ పూజ చేసి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో కృష్ణనదిలో నీటి సామర్థ్యం పెరిగిందని అన్నారు. దీంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది రైతులకు రెండు పంటలకు నీళ్లను అందించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకు 80 శాతం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగిలిన 20 శాతం త్వరలో కొనుగోలు చేయనుందని తెలిపారు. ర్యాలంపాడు.. నాలుగు టీఎంసీల సామర్యం గల రిజర్వాయర్లు ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు నిలువ ఉంటుందని, రెండు టీఎంసీలలో కొంత ఇబ్బందిగా ఉందని, విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడు, మార్కేట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, జంబురామన్ గౌడు, సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, విజయ్ పాల్గొన్నారు.