
విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలి
ధరూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలని అడిషనల్ డీఆర్డీఓ నర్సింహులు అన్నారు. మంగళవారం ధరూరు మండలం అల్వాలపాడు గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల యూనిఫాం తయారీకి అవసరమైన క్లాత్ను ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు అందించినట్లు తెలిపారు. దు స్తులను చక్కగా కుట్టి విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం ఇప్పటికే కుట్టిన యూనిఫాంలను ఆయన పరిశీలించారు. సమావేశంలో డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శోభారాణి, సీసీ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు.