
భూసమస్యలు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి చట్టం అమలుకు ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేసినట్లు ఇందుకు సంబంధించి మండలంలోని భూసమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు మండలంలో ఈనెల 5వ తేదీన గోపాల్దిన్నె, 6న వావిలాల, 7న పెద్దదిన్నె, 8న సాతర్ల, 9న ఎం.ఆర్.చెర్వు, 12న షాబాద్, 13న ఇటిక్యాల, 14న చాగాపురం 15న మునగాల, 16న ఉదండాపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రతిరోజు ఆన్లైన్లో నమోదు చేసి రోజువారిగా వాటిని నవీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ వీరభద్రప్ప, నరేష్, డీటీలు నందిని పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపిఎస్సి ద్వారా ఎంపికై న 10 మంది హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ను కలెక్టర్ సంతోష్ ఐడిఓసీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నియమితులైన ఉద్యోగులకు అభినందనలు తెలుపుతూ వారు తమ హాస్టల్స్లో విద్యార్ధుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్ధుల భద్రత, ఆహారం, వసతి మొదలైన వాటిపై శ్రద్ద పెట్టాలని సూచించారు. నియామక పత్రాలు అందుకున్న వారికి వివిధ ప్రాంతాల్లోని హాస్టల్స్లో బాధ్యతలు అప్పగించబడ్డాయని తెలిపారు. అలంపూర్ సురేష్గౌడ్, మల్దకల్ బస్వరాజ్, గట్టు రమేష్, గద్వాల ఆంజనేయులు, రామ్గోపాల్, మానవపాడు జయరాం, రాజోలి శేషన్న, ఉండవల్లి నరేష్ను నియమించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి సరోజమ్మ ఉన్నారు.
విద్యార్థికి అభినందనలు
పదో తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధిని అక్షయ శుక్రవారం కలెక్టర్ సంతోష్ను కలవగా.. ఆమెను అభినందించారు.
కలెక్టర్ బీఎం సంతోష్
‘భూభారతి’ పైలెట్ మండలంగా
ఇటిక్యాల ఎంపిక