
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మానవపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ బాలాజీరెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, ల్యాబ్, పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చే జ్వర పీడితుల వివరాలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని సూచించారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప, పీఎచ్సీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసన్నరాణి, డాక్టర్ హేమామనస, తదితరులు పాల్గొన్నారు.