వెంటనే సాగునీటిని విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

వెంటనే సాగునీటిని విడుదల చేయండి

Mar 14 2025 12:54 AM | Updated on Mar 14 2025 1:36 AM

కేటీదొడ్డి: ర్యాలంపాడు ప్రధాన కాల్వకు తక్షణం సాగునీటిని విడుదల చేయాలని, నీటి సరఫరా సమర్ధవంతగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, గువ్వలదిన్నె గ్రామంలోని నీటి కొరతతో ఎండుతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్‌ రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సరఫరా లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాలంపాడు ఎడమ ప్రదాన కాలువ 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, మైలగడ్డ గ్రామాల వద్ద కాలువ ప్రవాహన్ని నీటి సరఫరా పరిస్ధితిని కలెక్టర్‌ పరిశీలించారు. కాలువలో నీటి విడుదల పంపిణీ విధానం, ఆయకట్టు పరిదిలోని ప్రాంతాలకు నీరు చేరుతున్న తీరును తెలుసుకునేందుకు అక్కడి పంపింగ్‌ స్టేషన్లు పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడి రైతుల సూచనల మేరకు తక్షణమే సాగునీటిని కాల్వలకు విడుదల చేయాలని నీటి పారుదల వాఖ అధికారులను ఆదేశించారు. కాల్వల వెంట నీటి వినియోగాన్ని సమతుల్యంగా నిర్వహించే విధంగా చూడాలని, నీటి ప్రవాహం చివరి ఆయకట్టు వరకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని వారి పంటలను కాపాడేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకొని సాగునీటి సరఫరా పద్దతులను మొరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ రైతులకు వివరించారు. కలెక్టర్‌ వెంట వెంట ఇరిగేషన్‌ ఈఈ రహీముద్దీన్‌, వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, ఏడీఏ సంగీత లక్ష్మీ, విద్యుత్‌ శాఖ ఎడి రమేష్‌బాబు, ఏఓ సజీద్‌రెహమ్మన్‌, ఏఈఓ ప్రీయాంక, సంబందిత అధికారులు ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అడ్వాన్స్‌

టెక్నాలజీ సెంటర్లు

గద్వాల: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు వృత్తినైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు కోసం జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం గుర్తించడం జరిగిందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. గురువారం రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజయ్‌ నిర్వహించిన జూమ్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోగా నివేదిస్తామన్నారు. మీటింగ్‌లో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

ర్యాలంపాడు ప్రధాన కాల్వ, ఎండిన

పంటల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement