గద్వాలటౌన్: గద్వాలకు నూతన ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్టంలో ప్రస్తుతం 8 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని, మరో మూడు కొత్త కళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. నిజామాబాద్, సూర్యాపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కొత్త కళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని గద్వాల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, దేవదాసు, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీను, సాయి, ప్రదీప్, రాజు తదితరులు పాల్గొన్నారు.