గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 6926 కేసులు పరిష్కరించినట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కె కుష తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులకు సంబందించి ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు ఆయన తెలిపారు. ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని, లోక్ అదాలత్ మంచి అవకాశమని, చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల వారికి ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందన్నారు. సివిల్ తదితర కేసులలో ఒకరికొకరు రాజీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతాయని ఇద్దరూ గెలుస్తారని తెలిపారు తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి. లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, న్యాయవాదులు రాఘురాం రెడ్డి, తదితరులు ఉన్నారు.