ఇంటర్‌ పరీక్షలకు 102 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 102 మంది గైర్హాజరు

Mar 7 2025 12:41 AM | Updated on Mar 7 2025 12:41 AM

గద్వాలటౌన్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు దాదాపు అర గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జనరల్‌, ఓకేషనల్‌ విభాగాలలో మొత్తం 3,685 మంది విద్యార్థులు పరీక్షక్ష రాయాల్సి ఉండగా 3,583 మంది విద్యార్థులు హాజరయ్యారు. 102 మంది గైర్హాజరయ్యారు. అలాగే, జనరల్‌ విభాగంలో 3,027 మంది విద్యార్థులకుగాను 2,945 మంది.. ఓకేషనల్‌ విభాగంలో 658 మందికిగాను 638 మంది విద్యార్థులు హాజరయ్యారు. 97 శాతం హాజరు నమోదు అయింది. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ విద్యా జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 144 సెక్షన్‌ను కేంద్రాల వద్ద అమలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement