
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..
భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ వద్ద పశువులు ఇప్పటికే విద్యుదాఘాతానికి గురయ్యాయి. రోడ్డుపై నిత్యం ప్రయాణికులతో పాటు పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి రోజూ వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. ప్రమాదం జరగకముందే విద్యుత్శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్కు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– భూపాలపల్లి రూరల్