పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలి

Jun 24 2025 4:13 AM | Updated on Jun 24 2025 4:13 AM

పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలి

పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలి

ములుగు రూరల్‌: రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జంగాలపల్లి యూనియన్‌ బ్యాంక్‌ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా పహానీనకల్‌ ఆధారంగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, భిక్షపతి పాల్గొన్నారు.

రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

అమ్జద్‌పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement