
మావోయిస్టులకు సహకరించొద్దు
పలిమెల: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని పలిమెల ఎస్సై రమేష్ సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) దళాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మావోయిస్టు సాయుధ దళాలు, దళ సభ్యులు, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఆదివాసీ గుంపుల దగ్గరలో సంచరించినట్లయితే వెంటనే డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చి తగిన పారితోషికం పొందాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్యాన్స్ మాస్టర్స్అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గణేష్
భూపాలపల్లి అర్బన్: డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గణేష్, గౌరవ అధ్యక్షుడిగా రమేష్, సుధాకర్, రాజేష్, ఉపాధ్యక్షులుగా రాకేష్, నాని, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్, జాయింట్ కార్యదర్శిగా తిరుపతి, ఈసీ మెంబర్లుగా పలువురు ఎన్నికయ్యారు.
వికలాంగుల హక్కుల
పరిరక్షణ సమితి
జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లు
కాళేశ్వరం: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన బోధ రాజమల్లు నియామకమయ్యారు. సోమవారం నియామకపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉండే తనని గుర్తించి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

మావోయిస్టులకు సహకరించొద్దు

మావోయిస్టులకు సహకరించొద్దు