మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ

Jun 25 2025 1:37 AM | Updated on Jun 25 2025 1:37 AM

మున్స

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మేనేజర్‌ను బదిలీ చేస్తూ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజర్‌ రమేష్‌ను బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయానికి బదిలీ చేయగా భూపాలపల్లికి అతన స్థానంలో ఎవరినీ కేటాయించలేదు.

29, 30తేదీల్లో

రాష్ట్ర మహాసభ

కాటారం: వరంగల్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాఫ్రంట్‌(టీపీఎఫ్‌) నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో నాయకులతో కలిసి కిరణ్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తున్న టీపీఎఫ్‌ మహాసభలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కుడిమేత సరస్వతి, ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, నాయకులు సూర్యశంకర్‌, అయిత బాపు, అక్కల బాపు పాల్గొన్నారు.

గాజర్ల కుటుంబానికి

నకిరేకల్‌ ఎమ్మెల్యే పరామర్శ

టేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మాతృశ్రీ ఫౌండేషన్‌ చైర్మన్‌ దొంతుల శ్రీనివాస్‌, ఏవైఎస్‌, దళిత సంఘాల నాయకులు కూడా పరామర్శించారు. పరామర్శించిన వారిలో అరకొండ రాజయ్య, తిరుమలేష్‌, ఎలకటి రాజయ్య, సాంబయ్య, రాములు, కిరణ్‌, కుమార్‌, రమేష్‌, భద్రయ్య, ప్రకాశ్‌, సదానందం, క్రాంతి ఉన్నారు.

బొగ్గు లారీల అడ్డగింత

మల్హర్‌ : మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు లారీలను తాడిచర్ల ఎస్సీ కాలనీ యువకులు మంగళవారం అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద తాడిచర్ల డేంజర్‌ జోన్‌ ఇళ్లు సేకరించిన పలుమార్లు జెన్‌కో అధికారులు, రెవెన్యూ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కంపెనీ నిర్వాహకులు ఎస్సీకాలనీ పరిధిలో గ్రామస్తులను మభ్యపెడుతూ, వారు లేని సమయంలో కాల్వలు తీసి మట్టి పోస్తున్నారని విమర్శించారు. శ్రీధర్‌బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డేంజర్‌ జోన్‌ ఇళ్లు సేకరణకు కృషి చేయాలని వారు కోరారు. నిరుద్యోగ యువతకు ఓపెన్‌కాస్ట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. రాజ్‌కుమార్‌, ఓదెలు,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

తీర్థయాత్రలకు రైల్వే సేవలు వినియోగించుకోవాలి

ములుగు రూరల్‌ : తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని ఐఆర్‌టీసీ టూరిజం జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. ఉజ్జయిని (మహకాళేశ్వర్‌–ఓంకారేశ్వర్‌), త్రయంబకేశ్వర్‌–భీమశంకర్‌, ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగ యాత్రలో ఎల్లోరా, మోవ్‌, నాగ్పూర్‌ ప్రాంతాలను సందర్శించొచ్చని తెలిపారు. సాధారణ టికెట్‌ ధర రూ. 14,700, 3–ఏసీ రూ.22900, 2–ఏసీ రూ. 29,900 ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌, నాందేడ్‌, ముద్ఖడ్‌, పూర్ణ మీదుగా సాగుతుందని తెలిపారు. టికెట్‌ బుక్‌ చేసుకునే వారు 9701360701, 9281495843,9281030750, 9281030749 నంబర్లను సంప్రదించాలన్నారు.

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ
1
1/3

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ
2
2/3

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ
3
3/3

మున్సిపాలిటీ మేనేజర్‌ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement