
భూమిని పట్టా చేయాలి
మహదేవపూర్ మండలం ఎలకేశ్వర శివారులో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా మామ గారి పేరున ఉన్న భూమిని సమీపంలోని వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడు. అతని పేరును తొలగించి మాకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరినా పట్టించుకోవడం లేదు. భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కాస్తులో మేమే ఉన్నాం. అతనికి ఎటువంటి ఆధారాలు లేకున్నా అధికారులు ఆయన పేరును ఆన్లైన్లో ఎక్కించారు. భూభారతి ద్వారా అతని పేరు తొలగించి మా పేరు నమోదు చేయాలని కోరుతున్నాం.
– బి.సుశీల, బొమ్మపూర్, మహదేవపూర్