భూపాలపల్లి అర్బన్: ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబును ఎస్పీ కిరణ్ ఖరే మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలో న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు.
సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు
భూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్ఖరే అభినందించారు.
నేడు కలెక్టర్ సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతి నది పుష్కరాల అభివద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు.
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను అభినందించారు.
మేడే వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన నిర్వహించనున్న మేడే ఉత్సవాల వాల్ పోస్టర్ను ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఏరియాలోని వివిధ గనులలో ఆవిష్కరించారు. ఏరియాలోని కేటీకే ఒకటవ గనిలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ హాజరై మాట్లాడారు. మేడేను అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ చందర్, శ్రీనివాసు, చంద్రమౌళి, సదయ్య, నరేష్, అరుణ్ పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు

సివిల్స్ ర్యాంకర్కు సన్మానం