ప్రజలకు చేరువగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు చేరువగా ఉండాలి

Jun 3 2025 5:33 AM | Updated on Jun 3 2025 5:33 AM

ప్రజలకు చేరువగా ఉండాలి

ప్రజలకు చేరువగా ఉండాలి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో పోలీసులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఎస్పీ కిరణ్‌ఖరే తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ కిరణ్‌ఖరే జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. పోలీసులు వృత్తినే దైవంగా భావించి పనిచేయాలన్నారు. సమాజంలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో కీలక భూమిక పోషించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీలు సంపత్‌రావు, నారాయణనాయక్‌, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement