
ఉచిత ప్రయాణం, విద్యుత్..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకు వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలకు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పొదెం వీరయ్య తెలిపారు. రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సన్నధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. పేదలకు సన్న బియ్యం అందించి ఆకలి తీర్చడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షా 24వేల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగా.. రూ.23.88 వేల కోట్ల రూపాయలు ఆదా జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు 5,233 ఇండ్లు మంజూరు చేశామన్నారు.