నేడు వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

నేడు వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

నేడు వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

నేడు వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

హన్మకొండ కల్చరల్‌: చారిత్రక భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణంలో భాగంగా బుధవారం రాజగోపురాల నిర్మాణానికి, భద్రకాళి సాంగ ఆగమ సంస్కృత వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేషుభారతి తెలిపారు. ఈమేరకు దేవాలయం తూర్పు వైపు (మెయిన్‌ గేటు వద్ద) నుంచి రాజగోపురాల నిర్మాణం ప్రారంభం కానుంది. దేవాలయానికి వాయువ్య దిశలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం భూమిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈసందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేతుల మీదుగా శిలాన్యాసం జరుగుతుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు ఆర్‌.గోవింద హరి దేవాలయాన్ని సందర్శించారు. ఆయనను శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజల అనంతరం భద్రకాళి శేషు, వేదపండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి మహదాశీర్వచనం అందించారు. గోవింద హరి వెంట రాష్ట్ర ప్రధాన స్థపతి వల్లీ నాయగం, రాష్ట్ర దేవాదాయశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.దుర్గాప్రసాద్‌, ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన

రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement