మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 3 2025 5:33 AM | Updated on Jun 3 2025 5:33 AM

మంగళవ

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

మాట్లాడుతున్న వీరయ్య

రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పొదెం వీరయ్య ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్‌: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అటవీ ఆభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పొదెం వీరయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల ద్వారా అమలు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. పేదల సంక్షేమ, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణ

1,01,478మంది రైతులకు రూ.94.97వేల కోట్ల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం సీజన్‌ ముందుగానే ప్రారంభం కావడంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణకు పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని పొదెం వీరయ్య తెలిపారు. టాస్క్‌ఫోర్సు టీములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ధరణి లోపాలను సరిచేసేందుకు తెచ్చిన భూభారతి చట్టంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేసి దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి శాసనసభ ఆమోదం ద్వారా చట్టాన్ని తెచ్చామని అన్నారు. భూభారతి ద్వారా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని పేర్కొన్నారు. భూ భారతి చట్టంపై జిల్లావ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించామని, రేగొండ మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసి 11 రెవెన్యూ గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులు, చట్టంపై సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దాదాపు 5,112 దరఖాస్తులు రాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులకు పట్టాలు అందజేస్తున్నట్లు చెప్పారు.

కుంభమేళాను తలపించిన పుష్కరాలు

త్వరలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని పొదెం వీరయ్య చెప్పారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి నుంచి 2,375 మందికి నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేశామని, 12,200మందిని చేర్పులు చేశామన్నారు. సరస్వతీ పుష్కరాలు కుంభమేళాను తలపించాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని, అశేష భక్తజనంతో కాళేశ్వరం జనసంద్రంగా మారిందని సంతోశం వ్యక్తంచేశారు. దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతీ మాతా ఆశీస్సులు తీసుకుని ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారని అన్నారు.

‘భూ భారతి’పై ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసకువచ్చిన భూ భారతితో తమ భూ సమస్యలు తీరుతాయని రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతుంది.

న్యూస్‌రీల్‌

– మరిన్ని ఫొటోలు, వివరాలు II,IIIలోu

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/1

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement