కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు.. | - | Sakshi
Sakshi News home page

కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు..

Jun 26 2025 6:53 AM | Updated on Jun 26 2025 6:53 AM

కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు..

కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు..

స్టేషన్‌ఘన్‌పూర్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా ఒరగబెట్టిందేమి లేదు.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చేతగాని చవట దద్దమ్మలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో రూ.2.12కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆధునిక బిగ్‌ కవర్‌ షెడ్‌ను బుధవారం ప్రారంభించారు. అనంత రం ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటేనే నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళ ల పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని, రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఒక ఆర్థిక సంవత్సరంలోనే 25 లక్షల మందికి రూ.20,600 కోట్ల పంటరుణాలు మాఫీ చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ, ఇతర రాజకీ య పార్టీలు ఒక్కసారి ఆలోచించాలని హితవు పలి కారు. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎవరెన్ని చవకబారు విమర్శలు చేసినా పట్టించుకునే పనిలేదని, అభివృద్ధే తమ ఎజెండా అని అన్నారు. అనంతరం ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం ద్వారా 13 మంది క్రిష్టియన్‌ మైనా ర్టీ మహిళలకు కుట్టు మిషన్లు, వివిధ గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ లావణ్యశిరీష్‌రెడ్డి, డీఎంఓ బి.నరేంద్ర, డీఈ ఎల్లేష్‌, మార్కెట్‌ కార్యదర్శి జన్ను భాస్కర్‌, వైస్‌ చైర్మన్‌ నూకల ఐలయ్య, ఆర్‌డీఓ వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్‌ శ్రీధర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement