యువజన విభాగం కీలకంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యువజన విభాగం కీలకంగా పనిచేయాలి

Jun 26 2025 6:53 AM | Updated on Jun 26 2025 6:53 AM

యువజన విభాగం కీలకంగా పనిచేయాలి

యువజన విభాగం కీలకంగా పనిచేయాలి

జనగామ రూరల్‌ : పార్టీ బలోపేతంలో యువజన విభాగం కీలకంగా పనిచేయాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌కు ఆయనతోపాటు రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఖలీద్‌ హమీద్‌ హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివరాజ్‌యాదవ్‌ ఆధ్వర్యాన వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ఉపాధ్యక్షుడు చెట్కూరి కమలాకర్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్‌ కృష్ణన్‌, జనగామ, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల అధ్యక్షులు కర్క సంతోష్‌రెడ్డి, విజయ్‌, రాజేష్‌నాయక్‌, ప్రకాష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

శివచరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement