ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం

Jun 26 2025 6:47 AM | Updated on Jun 26 2025 6:47 AM

ప్రోత

ప్రోత్సాహం

గురువారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2025
ఉద్యాన పంటల సాగుకు

8లోu

సిద్ధేశ్వరుడికి లక్ష పుష్పార్చన

బచ్చన్నపేట : కొడవటూర్‌ స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో బుధవారం స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమావాస్య తిథి ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. ఆషాఢం ముగిసిన తర్వాత శ్రావణంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, మహాశివుడు, సిబ్బంది నూకల లక్ష్మీకాంత్‌రెడ్డి. గంగం భానుప్రకాష్‌రెడ్డి, బండా రి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. పంచ హారతులు, కుంభహారతి, నక్షత్ర హారతి, విశేష హారతులతో గర్భాలయం దేదీప్యమానంగా వెలుగొందింది. భక్తులు తిలకించి పులకించి పోయారు. కార్యక్రమంలో ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌.శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, నాగరాజు, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకట య్య తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణకు హైదరాబాద్‌ సౌభాగ్యపురికి చెందిన దాతలు అంచూరి హనుమంతరావు–గీత దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ఆలయానికి చేరుకున్న వారు ప్రత్యేక పూజల అనంతరం చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఈఓ లక్ష్మీప్రసన్న కు విరాళం అందజేశారు.

జాతీయ స్థాయి కబడ్డీ

పోటీలకు ఎంపిక

రఘునాథపల్లి: జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్‌ షిప్‌–2025(అండర్‌–19 బాలుర, బాలికల) పోటీలకు జిల్లా నుంచి యూ.సంతోష, జశ్వంత్‌ ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి వై.కుమార్‌గౌడ్‌, గట్టయ్య, ఉప్పల య్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో ఈనెల 28 నుంచి ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

అంకితభావంతో

సేవలందించాలి

కొడకండ్ల : వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించా రు. ఓపీ, స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం లక్ష్మక్కపల్లి సబ్‌సెంట ర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌ఓ.. ఇమ్యునైజేష న్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యాధికారి హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

పండ్లు, కూరగాయ తోటలకు సబ్సిడీపై డ్రిప్‌, స్ప్రింక్లర్లు

ఉచితంగా కూరగాయల నారు

పూల తోటలకు 40,

నీటి గుంటలకు 75శాతం

రాయితీ

2025–26 ఆర్థిక సంవత్సరం రూ.48.80 లక్షల బడ్జెట్‌

ఆయిల్‌పాం

పంట సాగును పరిశీలిస్తున్న

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

జనగామ రూరల్‌: జిల్లాలో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాంతో పాటు పండ్లు, కూరగాయల తోటల పెంపకమే లక్ష్యంగా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ముందుకు వెళ్తోంది. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యంగా అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. పండ్ల తోటల సాగు, సబ్సిడీపై నీటి కుంటల నిర్మాణం, యాంత్రీకరణ పనిముట్లు అందివ్వడానికి బడ్జెట్‌ కేటాయించారు.

పెరుగుతున్న ఆయిల్‌పాం సాగు

జిల్లాలో 2021 నుంచి 2025 మార్చి వరకు ఆయిల్‌పాం సాగు 6,963 ఎకరాల్లో చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాలుగా టార్గెట్‌ పెట్టుకుంది. కాగా 2వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించగా, ఇప్పటి వరకు 98 ఎకరాలకు మొక్కలు పంపిణీ చేశారు. ఒక్కో మొక్కకు రూ.193 సబ్సిడీ ఇవ్వగా, రైతు రూ.20 భాగస్వామ్యంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఆయిల్‌పాం దిగుబడి 3వేల ఎకరాల్లో 18వేల టన్నులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 29 మంది రైతులు 227 మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించారు.

పండ్ల తోటల సాగుకు సబ్సిడీ

జిల్లాలో మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయ, అరటి, డ్రాగన్‌, అవకాడో తదితర పండ్ల తోటలు 146.50 ఎకరాల్లో సాగు లక్ష్యంగా రూ.48.80లక్షల బడ్జెట్‌ కేటాయించారు. రెండు సంవత్సరాల పాటు రూ.32వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇవ్వనున్నారు. 12.5 ఎకరాల్లో బంతి, చామంతి, మల్లె, లోకల్‌ గులాబీ యూనిట్‌ ధర రూ.20వేలు నిర్ణయించగా.. 40 శాతంతో రూ.8వేల సబ్సిడీ ఉంది. దుంప జాతిరకంలో 5.5 ఎకరాల్లో లిల్లీ, జర్బెర, గ్లాడియోలస్‌ రకానికి చెందిన పూలతోటలసాగుకు యూనిట్‌ ధర రూ.లక్ష కాగా.. ఇందులో రూ.40వేల రాయితీ లభిస్తుంది. అలాగే ఎకరా టమాటా, వంకాయ కూరగాయల తోటలకు రూ.8వేలు, పచ్చి మిర్చికి 6,400 మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొత్తంగా 85 ఎకరాల టార్గెట్‌తో రైతులను ప్రోత్సహిస్తున్నారు. అంటుకట్టిన కూరగాయల సాగు కు సంబంధించి 20 ఎకరాలు లక్ష్యం పెట్టుకు ని ఎకరాకు 2వేల వంగ మొక్కలు ఇస్తారు. ఇందుకు రైతు తన వాటాగా రూ.5వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది.

మామిడి తోటల పునరుద్ధరణ

జిల్లాలో 20 ఎకరాల్లో పాత మామిడి తోటల పునరుద్ధరణకు ఒక్కో యూనిట్‌ రూ.24వేల చొప్పున 40శాతం(రూ.9,600)తో రాయితీ ఇస్తున్నారు. అలాగే 6 యూనిట్ల నీటి గుంటల(ఫాంపాండ్స్‌) నిర్మాణానికి ఒక్కో యూనిట్‌ ధర రూ.1.50లక్షల చొప్పున నిర్ణయించి 75శాతం(రూ.75వేలు) సబ్సిడీ ఇస్తారు. మల్చింగ్‌ విధానంతో కూరగా యల సాగుకు 2.50 ఎకరాలకు యూనిట్‌(ఎకరాకు) రూ.1,600 ధరతో రూ.8వేల సబ్సిడీ ప్రకటించారు. మిర్చి ఎండ బెట్టేందుకు 70 కేజీల సామర్థ్యంతో 36 యూనిట్ల సోలార్‌ డ్రయ్యర్లను ఒక్కో యూనిట్‌కు రూ.2.50లక్షల ధర ఉంది. ఇందులో జనరల్‌ వారికి 40శాతంతో రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీలకు 55 శాతంతో రూ.1.37లక్షల సబ్సిడీ ఇస్తున్నా రు. 8 నుంచి 11 హెచ్‌పీ పవర్‌ టిల్లర్లు 6 మంజూరు చేశారు. సన్న, చిన్న కారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ ఉంది. 9 పవర్‌ టిల్లర్లు మంజూరుకాగా.. చిన్న, సన్న, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం రాయితీతో ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 బ్రష్‌ కటర్లు మంజూరు కాగా, ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం, 10 స్ప్రేయర్‌ పంపులకు గాను ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఆయిల్‌పాం సాగుపై దృష్టి

జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరం 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2వేల ఎకరాలు గుర్తించి 98 ఎకరా లకు మొక్కలు అందించాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రైతులకు వివరిస్తున్నాం. తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు భూమి పాస్‌బుక్కు నకలు, ఆధార్‌, బ్యాంకు ఖాతా బుక్కు, పాస్‌ఫొటో జత చేసి సంబంధిత ఉద్యానవన అధికారులకు అందించాలి. ఓసీ లేదా ఇతర రైతులకు 50శాతం, బీసీలకు 29శాతం, ఎస్సీ రైతులకు 15శాతం, ఎస్టీలకు 6 శాతంతో రిజర్వేషన్ల ఆధారంగా రాయితీపై మొక్కలు, తోటల సాగుకు సంబంధించి మంజూరు చేస్తాం. దరఖాస్తులు రాగానే కలెక్టర్‌కు పంపిస్తాం. అనంతరం సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత రాయితీకి ఆర్థిక పరమైన అనుమతులు పొందుతాం.

– బి.శ్రీధర్‌రావు,

జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి

పండ్ల తోటల పెంపకం, సబ్సిడీ వివరాలు

(2025–26 సంవత్సరం ఎకరాల్లో..)

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

న్యూస్‌రీల్‌

పంట లక్ష్యం యూనిట్‌ ధర రాయితీ(40శాతం)

మామిడి 65 రూ.80వేలు రూ.32వేలు

నిమ్మ 7.50 రూ.80వేలు రూ.32వేలు

జామ 10.00 రూ.80వేలు రూ.32వేలు

సీతాఫలం 2.50 రూ.30వేలు రూ.12వేలు

బొప్పాయి 20.00 రూ.30వేలు రూ.12వేలు

డ్రాగన్‌ 9.00 రూ.2.70లక్షలు రూ.1.08లక్షలు

అరటి 25.00 రూ.70వేలు రూ.28వేలు

అవకాడో 7.50 రూ.50వేలు రూ.20వేలు

ఈ పంటల సాగుకు రెండు సంవత్సరాల పాటు రాయితీ ఇస్తారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు మొక్కలు, ఎరువు, పురుగు మందుల బిల్లులు జత పరిచి హార్టికల్చర్‌ అధికారులకు అందజేయాలి.

ప్రోత్సాహం1
1/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం2
2/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం3
3/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం4
4/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం5
5/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం6
6/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం7
7/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం8
8/9

ప్రోత్సాహం

ప్రోత్సాహం9
9/9

ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement