
రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెల్లువ
14
1,510
లింగాల
ఘణపురం
20
1,044
జనగామ
బచ్చన్నపేట
23
2,504
దేవరుప్పుల
13
1,003
08
1,151
రెవెన్యూ సదస్సులో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్బాషా (ఫైల్)
మండలాల వారీగా దరఖాస్తులు
● భూ భారతిలో లేని ఆప్షన్లకే ఎక్కువ వినతులు●
● ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ షురూ
● సత్వర పరిష్కారానికి అధికారుల చర్యలు
08
1,013
నర్మెట
తరిగొప్పుల
గ్రామాలు దరఖాస్తులు
జనగామ రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడంతో ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతుల నుంచి వివిధ సమస్యలపై 18,929 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. సదస్సులు ముగిసిన రోజు నుంచే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించగా, మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించనున్నారు.
తహసీల్దార్కు కీలక బాధ్యతలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. కానీ ధరణి ఆప్షన్లో తహసీల్దార్, ఆర్డీఓ, ఏసీ కోర్టు లేకపోవడం క్షేత్ర స్థాయి నుంచి కాకుండా కలెక్టర్కు హక్కులను కల్పించడంతో రైతుల కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి స్థానంలో భూ భారతి తీసుకువచ్చారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓలకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఈ పోర్టల్కు రూపకల్పన చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతో మొదటగా పైలట్ గ్రామాలను ఎంపిక చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో విజయవంతం కావడంతో అన్ని గ్రామాల్లో అమలు చేశారు. ఒక్కో గ్రామంలో దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆప్షన్లు లేని వాటికే ఎక్కువ..
జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఇందులో 18,929 మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. 17 మాడ్యూల్స్కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరుగగా, అత్యధికంగా ఇందులో లేని ఆప్షన్లకు 8,512 దరఖాస్తులు రావడం గమనార్హం. మిస్సింగ్ సర్వే నంబర్ 2,959, పెండింగ్ మ్యుటేషన్ (కోర్టు ఆర్డర్స్) 1,583, డీఎస్ పెండింగ్ (డిజిటల్ సైన్) 291, ఎక్స్టెంట్ 1,580, పట్టాదార్ పాస్ బుక్కులో నేమ్ చేంజ్ 142, ప్రొహిబిటెడ్ నుంచి డిలీషన్ 163, అసైండ్ ల్యాండ్ ఇష్యూస్ 388 దరఖాస్తులు వచ్చాయి. భూములను హోల్డింగ్లో ఉంచడం, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, వారసత్వం, అసైన్డ్, ఓఆర్సీ, 38–ఇ, భూ యజమాని తండ్రి పేరు, కులం, ఆధార్ నంబర్ల తప్పులు, మ్యుటేషఫన్, డిజిటల్ సంతకం, పట్టాదార్ పుస్తకాల్లో భూములు ఎక్కలేదని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించే సమయంలో రోజు వారీగా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ వాటిని పరిశీలన చేసి నివేదిక రూపంలో సీసీఎల్ఏకు పంపించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో తహసీల్దార్లు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా ముగించారు.
రఘునాథపల్లి
19
3,535
చిల్పూరు
12
666
13
1,062
స్టేషన్ఘన్పూర్
16
850
జఫర్గఢ్
●
పాలకుర్తి
21
3,619
కొడకండ్ల
09
972
మొత్తం
176
18,929