
శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి
జనగామ రూరల్: నేటి యువత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ అన్నారు. మంగళవారం జనగామ పట్టణంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలి దాన్ దివాస్ పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ‘ఒక మొక్క–అమ్మ పేరు మీద’ అనే కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూప్రతిఒక్కరూ మొక్కలు నాటా ల న్నారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, ఎల్ల య్య, అనిల్, నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.