
కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
● జిల్లా గిరిజన సహాయ అధికారి రూపాదేవి
పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి రూపాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కార్డులు, కుల ధృవీకరణ, కిసాన్ పథకాలు, బ్యాంకు అకౌంట్, పెన్షన్లు, ప్రధాన మంత్రి జనశ్రీ బీమా యోజన తదితర పథకాలపై అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, పశువైద్యాధికారి అశోక్ రెడ్డి, ఏపీఓ మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్, గణేశ్, మహేష్, సిద్దారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.