
ప్రజావాణికి అర్జీల వెల్లువ
● దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్ లత ● వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన
ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ లత అర్జీలు స్వీకరించారు. 39 మంది దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన లత సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.