
పశువుల రవాణా నివారణకు చర్యలు
జగిత్యాలక్రైం: పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. పోలీస్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది నిరంతర నిఘాతో పనిచేస్తారని తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా, అసభ్యకరమైన పోస్టులు పెట్టొద్దని, అలాంటి వారిపై చర్యల కోసం మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజారాంపల్లిలో చెక్పోస్ట్
వెల్గటూర్: ఎస్పీ ఆదేశాల మేరకు ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో చెక్పోస్ట్ను ప్రారంభించినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. పశువుల రవాణా నిబంధనల మేరకు జరగాలని, అనుమతి లేకుండా ఆవులు, దూడలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.