
రాయికల్లో తిరంగా యాత్ర
జగిత్యాలరూరల్(రాయికల్): ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్వాగతిస్తూ శనివారం రాయికల్లో బీజేపీ పట్టణ నాయకులు పాతబస్టాండ్ నుంచి భరతమాత విగ్రహం వరకు తిరంగాయాత్ర నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దేశభక్తి, ఐక్యత, సమైక్యతను ప్రజల్లో బలపర్చాలనే లక్ష్యంతో తిరంగాయాత్ర నిర్వహించినట్లు పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వడ్డెపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేశ్, నాయకులు తీపిరెడ్డి రాజశేఖర్రెడ్డి, బన్న సంజీవ్, భూమేశ్, శ్రీకాంత్రెడ్డి, సామల్ల సతీశ్, సాయిరాజ్గౌడ్, నరేందర్, కుర్మ నారాయణరెడ్డి, మల్లారెడ్డి, అశోక్, మల్లేశ్, రంగోపాల్, మోహన్రెడ్డి, నర్సయ్య, సంతోష్, బొంగోని భూమాగౌడ్, రాజేశం పాల్గొన్నారు.