జగిత్యాల: మహిళల హక్కులను కాపాడుతూ వారి సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళల మెరుగైన జీవన ప్రమాణాల కోసం రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.10 లక్షల వరకు ప్రమాదబీమా, వ్యాపారవేత్తలుగా మలిచేందుకు సోలార్ పవర్ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్లో 5శాతం పెట్రోల్ బంక్లు ఇచ్చామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలు కుటుంబం, సమాజపరంగా గౌరవం సాధిస్తూ పిల్లలను భావితరాలకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. అనంతరం ప్రతిభ కబనర్చిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్
పెగడపల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు అందిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. లబ్ధిదారులెవరూ దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. అర్హులకు పథకాలు అందకుంటే ఎంపీడీవో, తహసీల్దార్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లోని 88 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పంట రుణమాఫీ పూర్తి చేశామని, అందని వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, విండో మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు భాస్కర్, తిరుపతి, కిషన్, రవినాయక్, అంజయ్య, మల్లారెడ్డి, అనిల్గౌడ్, సత్తిరెడ్డి, సురేశ్, మల్లారెడ్డి, కృష్ణహరి, వెంకట్రావు, రామ్రెడ్డి, శ్రీనివాస్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.