పారాత్రోబాల్ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్మెడల్
కేయూ క్యాంపస్: ఇండోనేషియాలోని సురకర్ణా నగరంలో ఉన్న గోర్ ఎఫ్కోర్ యూనివర్సిటీలో ఈనెల 15న నిర్వహించిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ మ్యాచ్ సిరీస్లో కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి గోల్డ్మెడల్ సాధించింది. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం కృష్ణవేణిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డిఫెరెంట్లీఏబుల్డ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రాజు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వాయిదావేసిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ను మంగళవారం పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, లైబ్రరీ సైన్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.
హన్మకొండ: త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా గరిష్టస్థాయిలో వ్యవసాయ విద్యుత్ సర్వీస్లు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొ త్తం 355 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో టీబీ నియంత్రణకు కృషిచేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, క్షయ వ్యాధి నివారణ సిబ్బంది సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీ మరణాలు తగ్గించడానికి ఇలాంటి శిక్షణ ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ బ్లెస్సి మాట్లాడుతూ క్షయ నియంత్రణలో భాగంగా హైరిస్క్ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి, మందులు అందించాలని అన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ కోసం 1,93,935 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. 73,711 మందికి ఎక్స్రేలు తీశామని, వీరిలో 1,104 మందికి టీబీ గుర్తించినట్లు తెలిపారు.
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో ఈ ఏడాది స్ప్రింగ్స్ప్రీ–26 వసంతోత్సవం ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. వేడుకల వివరాలను నిట్ అఫీషియల్ వెబ్సైట్, సోషల్ మీడియాలో విద్యార్థుల రిజిస్ట్రేషన్ నిమిత్తం ఏర్పాటు చేశారు. వేడుకలకు సినీనటి నటులు అడివి శేషు, నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త మీనన్ హాజరుకానున్నట్లు సమాచారం.
పారాత్రోబాల్ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్మెడల్


