సదర్ సంబురం
యాదవుల తీన్మార్ స్టెప్పులు, డప్పు దరువులతో ఖిలా వరంగల్ కోట గురువారం రాత్రి మార్మోగింది. సదర్ ఉత్సవంలో భాగంగా దున్నపోతుల విన్యాసాలు అలరించాయి.
కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించాలని వరంగల్ డీఈఓ రంగయ్య నాయు డు, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 14,279 మంది, 6 నుంచి పదో తరగతి వరకు 17,936 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 24,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు.


