శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు

Jul 22 2025 6:34 AM | Updated on Jul 22 2025 9:21 AM

శ్రీధ

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు

వరంగల్‌ చౌరస్తా : వరంగల్‌ ఎల్‌బీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మాసూమ్‌ అలీ)లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామన్నపేటకు చెందిన వ్యాఖ్యత, గాయకుడు ఠయ్యాల శ్రీధరాచార్యులకు జాతీయ స్థాయి భారత్‌ భూషణ్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో శ్రీ గౌతమేశ్వర సాహితి కళాసేవ సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కళాకారులు, ఉపాధ్యాయులు, వ్యాఖ్యాతలు ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రముఖ కవి పొర్ల వేణుగోపాల రావు, సీ్త్ర అలంకరణ నిపుణులు కుంచాల లావణ్య, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్‌ గోపాల కృష్ణయ్య, సేంద్రియ వ్యవసాయ పరిశోధన నిపుణులు యాదగిరి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మెడికవర్‌లో అరుదైన శస్త్రచికిత్స

కాజీపేట అర్బన్‌ : హంటర్‌రోడ్డులోని మెడికవర్‌ ఆస్పత్రిలో 71 ఏళ్ల వృద్ధుడికి బ్రెయిన్‌, స్పైనల్‌ కార్డ్‌ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు న్యూరో సర్జన్‌ డాక్టర్‌ టి.సంజయ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నగరానికి చెందిన వృద్ధుడు నాగయ్య బీపీ, అస్తమాతో బాధపడుతున్నాడు. అలాగే బ్రెయిన్‌, స్పైనల్‌కార్డ్‌ కలిసే ప్రాంతంలో (సెర్వికో మెడ్యూల్లరీ జంక్షన్‌) కణితి ఏర్పడింది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం నాగయ్య ప్రయత్నించగా హైదరాబాద్‌కు వెళ్లమని వైద్యులు సూచించారు. కాగా నాగయ్య మెడికవర్‌ ఆస్పత్రికి రాగా వైద్యపరీక్షలు నిర్వహించి ఈనెల 15వ తేదీన హైస్పీడ్‌ డ్రిల్‌ అండ్‌ ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్‌తో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి పూర్తిగా మత్తు ఇవ్వకుండా ఆపరేషన్‌ సమయంలో చేతులు, కాళ్ల కదలికలను గమనిస్తూ శస్త్రచికిత్సను పూర్తి చేశామని, ఇప్పుడు రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. నగరంలోనే తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్సను అత్యాధునిక పరికరాలతో మెడికవర్‌ హాస్పిటల్‌ యాజమాన్యం సౌజన్యంతో పూర్తి చేసామని తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ నమ్రత, వైద్యులు ఉన్నేష్‌, దీపక్‌నాగులు పాల్గొన్నారు.

గుండ్లవాగు ప్రాజెక్టులో మృతదేహం లభ్యం

గోవిందరావుపేట : మండలంలోని గుండ్లవాగు ప్రాజెక్టులో అనుమానాస్పదస్థితితో చనిపోయిన వ్యక్తి ఆచూకీ లభ్యమైందని పస్రా ఎస్సై కమలాకర్‌ తెలిపారు. సోమవారం గుండ్లవాగులో వ్యక్తి మృతదేహం ఉన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల గ్రామానికి చెందిన ఈసంపల్లి మణికుమార్‌ (26) ఎలక్ట్రిషీయన్‌ పని చేస్తున్నాడు. గురువారం తన తండ్రితో గొడవపడగా మందలించాడు. అనంతరం స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌ ఉందని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. శనివారం తన చెల్లెలు రాణికి ఫోన్‌ చేసి నాకు బతకాలని లేదని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని తెలిపారు. గుండ్లవాగులో లభ్యమైన మృతదేహం విషయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా తమ కుమారుడు మణికుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు1
1/3

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు2
2/3

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు3
3/3

శ్రీధరాచార్యులకు భారత్‌ భూషణ్‌ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement