బకాయిలపై నిర్లక్ష్యం తగదు● | - | Sakshi
Sakshi News home page

బకాయిలపై నిర్లక్ష్యం తగదు●

Jul 12 2025 6:54 AM | Updated on Jul 12 2025 6:54 AM

బకాయిలపై నిర్లక్ష్యం తగదు●

బకాయిలపై నిర్లక్ష్యం తగదు●

ప్రతినెలా 10లోపు వసూలు చేయాలి

డీఎంఓల సమావేశంలో జేడీ శ్రీనివాస్‌

వరంగల్‌ చౌరస్తా: మార్కెట్‌ ఫీజుల బకాయి ఫీజుల వసూలులో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని మార్కెటింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఉప్పల శ్రీనివాస్‌ హెచ్చరించారు. వరంగల్‌ లక్ష్మీపురంలోని జేడీ కార్యాలయంలో డీడీఎంఓలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌ ఫీజు పాత బకాయిలతోపాటు కొత్తగా ఫీజును ప్రతినెలా 10వ తేదీలోపు వసూలు చేయాలని సూచించారు. చెక్‌ పోస్టులు నిర్దేశిత టార్గెట్లను వసూలు చేయాలన్నారు. సమావేశంలో డీడీఎం ఒడితల పద్మావతి, డీఎంఓ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement