
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వేలేరు; విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని స ద్వినియోగం చేసుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మ హమ్మద్ అజీజ్ఖాన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో డీవైఎస్ఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శి బిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు వేసవి సెలవుల్లో సెల్ఫోన్కు, సోషల్ మీడియాకు బానిస కాకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని అ న్నా రు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల సారంగపాణి, కోశాధికారి బిన్ని లక్ష్మణ్, నెట్బాల్ జిల్లా అధ్యక్షుడు కందుల సృజన్కాంత్, జిల్లా కబడ్డీ అసోసియేన్ సహయ కార్యదర్శి సద్ధాం హుస్సేన్, ఫిజికల్ డైరక్టర్లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్