
సనాతన ధర్మమే సంస్కారం నేర్పుతుంది
హన్మకొండ కల్చరల్/దామెర: సనాతన ధర్మమే సంస్కారం నేర్పిస్తుంది.. ఆ ధర్మాన్ని పాటిస్తూ దేశవ్యతిరేక శక్తులపై స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని వారణాసి విశ్వనాథస్వామి దేవస్థానం(ఉత్తరాధికారి) ద్వితీయ పీఠాధిపతి శ్రీశ్రీసుదర్శనానందస్వామి అన్నారు. ఆదివారం హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయనను ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన స్వాగతించారు. అనంతరం శ్రీసుదర్శనానందస్వామి కాశీలోని మణికర్ణికఘాట్ నుంచి తెచ్చిన గంగా జలంతో రుద్రేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయనాట్యమండపంలో అనుగ్రహభాషణం చేస్తూ.. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈనెల 15 నుంచి జరిగే సరస్వతీ పుష్కరాల్లో స్నానమాచారించాలని, ఇందుకు ప్రభుత్వం తగిన ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.
ఇదిలా ఉండగా..
దామెర మండలం పులుకుర్తి సమీపంలోని శ్రీ బాలమానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ధన్వంతరి సహిత హనుమాన్ మహా యజ్ఞం కార్యక్రమంలో శ్రీ సుదర్శనానందస్వామి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏసీపీ శివరామయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ పెసరు విజయచందర్ రెడ్డి, పీఠాధిపతి లక్ష్మీనారాయణ గురుభవాని, పడకంటి జ్యోతి హాజరయ్యారు.
సుదర్శనానందస్వామి