
కార్మిక హక్కుల సాధనకు పోరాటం
హన్మకొండ: కార్మికుల హక్కుల సాధనకు పోరాడుదామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక మాసోత్సవం లోగో వాల్పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం మాసమంతా కార్మికవాడల్లో పర్యటిస్తానని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. లేబర్ కార్డులు, పెండింగ్ బిల్లుల విడుదలకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆటో కార్మికులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల కోసం పోరాడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు నాయిని రవి, ఇంజాల మల్లేశం, రవీందర్ రెడ్డి, ఇస్మాయిల్, రమేష్, బాబురావు, నరహరి, శివకుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు.