
ప్రజాస్వామ్య రక్షణకు యువత పోరాడాలి
ఖిలా వరంగల్: మతోన్మాదులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య రక్షణ కోసం యువత పోరాడాలని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీఉల్లాఖాద్రీ పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ శివనగర్లోని సీపీఐ తమ్మెర భవనంలో జెండాను ఆయన శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలని పోరాటాలు చేసి ఓటు హక్కును సాధించిన ఘనత ఏఐవైఎఫ్కే దక్కిందని వలీఉల్లాఖాద్రీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మస్కా సుధీర్, హసీనా, విజయ్, కిరణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.