
శోభాయమానం.. భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి.. అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సేవా కార్యక్రమాలకు వరంగల్ కమ్మసేవా సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ తంతు శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమ్మవారికి ఉదయం సింహ వాహన
సేవ, సాయంత్రం గజ వాహన సేవ

శోభాయమానం.. భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం