
క్షేత్రస్థాయిలో పర్యటించిన మేయర్
వరంగల్: మేయర్ గుండు సుధారాణి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్ పరిధి వాసవికాలనీ, రామన్నపేట, గాంధీ బొమ్మ, గంగపుత్ర వీధి ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. శానిటేషన్, డ్రెయిన్లు, సీసీ రోడ్ల ఏర్పాటు తదితర సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఓరుగంటి పూర్ణ, వడ్లకొండ విజయ్, పసునూరి చందర్, పాకాల సాంబయ్య, దేవరకొండ కృష్ణ, అప్పరాజు లక్ష్మి, కొలిపాక పద్మ, సౌరం పద్మ, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.