
శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ : జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య స్కూల్ 2022–23 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. 50 లోపు ర్యాంకులు ముగ్గురు, 100 లోపు ర్యాంకులు నలుగురు, 500 లోపు ర్యాంకులు ఐదుగురు, 5వేల లోపు ర్యాంకులు 13 మంది సాధించారని వివరించారు. బండారి రుషికాంత్ 31వ ర్యాంకు, ఎస్.సాయి రిషాంత్ రెడ్డి 39, గొర్రె నితిన్ రెడ్డి 44, శాగంటి త్రిశూల్ 66, ఉప్పుల భావాప్రిత 273వ ర్యాంకు సాధించారని వివరించారు.
టోల్ప్లాజా వద్ద లారీ బీభత్సం
● ధ్వంసమైన టోల్ క్యాబిన్..
సిబ్బందికి గాయాలు
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాతీయ రహదారిపై కోమళ్ల టోల్ప్లాజా వద్ద శనివారం లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ సరాసరి టోల్ప్లాజా క్యాబిన్లో దూసుకెళ్లాడు. దీంతో క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది ఒకరు గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్కు చెందిన లారీ డ్రైవర్ మక్కల శంకర్ హైదరాబాద్ నుంచి లారీతో హనుమకొండకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ కోమళ్ల టోల్ప్లాజా వద్ద రెండో నంబర్ క్యాబిన్లోకి లారీతో దూసుకెళ్లగా, క్యాబిన్ ధ్వంసమైంది. విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బంది బండి శ్రీనాథ్గౌడ్ గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టగా దెబ్బతింది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ శంకర్కు బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లు తేలిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై
తెలిపారు.

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ