హన్మకొండ: వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన కా ర్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం కాంట్రోల ర్ ఆఫ్ ఎగ్జామిషన్స్ ప్రొఫెసర్ కె.రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో మొత్తం ఉత్తీర్ణత 56.65 శాతం ఉందన్నారు. కోర్సుల వారీగా ఫలితా లు చూస్తే... బీబీఏలో 63.80 శాతం, బీకాంలో 60.57 శాతం, బీఎస్సీలో 51.87 శాతం, బీసీఏలో 57,27 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బోధన సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్వయంప్రతిపత్తి విద్యా రంగం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ డా.ఎ.శేషాచలం మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకుల కృషిని కొనియాడారు. భవిష్యత్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కళాశాల వ్యవస్థాపకుడు, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ వాహినీ దేవి, ప్రొఫెసర్ బెనర్జీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిందర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజిరెడ్డి, కంట్రోలర్ సి.దత్తాత్రేయులు పాల్గొన్నారు.