
మినీ జాతర ఆదాయం రూ.1.08 కోట్లు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మినీ జాతరలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన హుండీల కానుకలను బుధవారం లెక్కించారు. మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయ డార్మెటరీ భవనంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారుల సమక్షంలో ఈఓ రాజేంద్రం పర్యవేక్షణలో కానుకలు లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ. 58,66,409, సారలమ్మ ఆదాయం రూ. 45,61,892, పగిడిద్దరాజు ఆదాయం రూ. 1,61,003, గోవిందరాజు హుండీ ఆదాయం రూ. 2,13,863 మొత్తం రూ. 1,08,03,173 ఆదాయం వచ్చినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. భక్తులు విదేశీ డాలర్లు సమర్పించినట్లు పేర్కొన్నారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఇన్స్పెక్టర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.
హుండీ కానుకల లెక్కింపు చేపట్టిన అధికారులు