పర్యావరణ సమతుల్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ సమతుల్యత పాటించాలి

Mar 27 2025 1:12 AM | Updated on Mar 27 2025 1:12 AM

పర్యా

పర్యావరణ సమతుల్యత పాటించాలి

కలెక్టర్‌ ప్రావీణ్య

జాతీయ సదస్సు ప్రారంభం

హన్మకొండ అర్బన్‌: వనరులను సంరక్షించుకునేందుకు, పర్యావరణ సమతుల్యతను పెంపొందించుకునేందుకు మెటీరియల్‌ సైన్స్‌ దోహదపడుతుందని హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. నగరంలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఇంటర్‌ డిసిప్లినరీ మెటీరియల్స్‌ సైన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ (ఎన్‌సీఐఎంఎస్‌ఎస్‌ఈఈ–2025)’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ బి.చంద్రమౌళి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సృజనాత్మక ఆలోచనలతో సుస్తిరాభివృద్ధిలో భాగం కావాలని, వివిధ రకాల నైపుణ్యాల్ని వినియోగించుకొని సూచించారు. ‘లెర్న్‌ ఇట్‌ బై డూ ఇట్‌ ’ అనే భౌతిక శాస్త్ర భావన ద్వారా అవకాశాలను అందుకోవాలన్నారు. అనంతరం సదస్సులో 120 మంది రాసిన పరిశోధక వ్యాసాలను ఐఎస్‌బీఎన్‌తో రూపొందించిన సావనేర్‌ను కలెక్టర్‌ అవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎన్‌ఐటీ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డి.హరినాథ్‌, సదస్సు కన్వీనర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.అరుణ, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌.అన్వేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుహాసిని, కో–కన్వీనర్‌ కవిత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ సురేశ్‌బాబు, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ అరుణ, అధ్యాపకులు హెప్సిబా, ప్రవీణ్‌కుమార్‌, పద్మ, సుజాత, మధు, సారంగపాణి పాల్గొన్నారు.

స్వయం ఉపాధి శిక్షణను వినియోగించుకోవాలి

మామునూరు: మహిళలు స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య అకాడమీ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గోపాల్‌లాల్‌ అన్నారు. ఖిలా వరంగల్‌ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో కేవీకే కోఆర్డినేటర్‌ రాజన్న అధ్యక్షతన షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు పర్యావరణహిత జనప నార బ్యాగుల తయారీపై నాలుగు రోజులు శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. గోపాల్‌లాల్‌ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూపులు, మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొంది న మహిళలకు ఉత్పత్తులకు మార్కెట్‌ చూపడంతో పాటు ఉపాధి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ విజయేంద్రరెడ్డి, అరుణ్‌ జ్యోతి, సౌమ్య,

రాజు,

మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ సమతుల్యత పాటించాలి1
1/1

పర్యావరణ సమతుల్యత పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement