పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

Published Sat, Mar 22 2025 1:03 AM | Last Updated on Sat, Mar 22 2025 1:03 AM

పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

ఖిలా వరంగల్‌: అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద కొనసాగుతున్న వరంగల్‌ రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులను శరవేంగా పూర్తి చేయాలని దక్షణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కిమ్‌ (ఎబీఎస్‌ఎస్‌) కింద రూ.25.41కోట్లలో జరుగుతున్న పాదచారుల వంతెన(ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి), 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, గ్రీనరీ పనులను పరిశీలించారు. అంతకు ముందుగా రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌ను తిలకించారు. అనంతరం జీర్పీ పోలీసులకు నూతన భవనం నిర్మించాలని జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం భరతేష్‌కుమార్‌, సీనియర్‌ డీసీఎం బాలాజీ కిరణ్‌, స్టేషన్‌ మేనేజర్‌ బాలరాజ్‌నాయక్‌, సీసీఐ రాజగోపాల్‌, ఆర్పీఎఫ్‌ సీఐ సీఎస్‌ ఆర్‌ కృష్ణ, జీర్పీ సీఐ సురేందర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement