
వృద్ధులను సన్మానిస్తున్న అధికారులు
అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీమాబాద్: వయోవృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ అడిషనల్ కలెక్టర్ అశ్వినితానాజీ వాకడే అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో వృద్ధులను సోమవారం సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధుల అవసరాలను తీర్చి కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కొడుకులు, కూతుళ్లపై ఉందని గుర్తు చేశారు. కుటుంబ వి వక్షకు గురైతే తక్షణసాయం కోసం 14567 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. జిల్లా సంక్షేమాధికారి శారద, జిల్లా స్వీప్ నోడల్ అధికారి నరసింహమూర్తి, డీఆర్డీఓ కార్యాలయం ఈఓ పరమానంద, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.