
సాయిగణేష్కాలనీ ఖాళీ ప్లాట్లలో..
వరంగల్: నగరంలో ని 14 డివిజన్ లక్ష్మీగణపతికాలనీ, సాయిగణేష్కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో మురుగునీరు, వర్షపు నీరు నిలిచి దోమలతో పాటు విషపురుగుల సమస్య నెలకొంది. ఇక్కడ ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవని, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్, మేయర్కు వినతి పత్రాలు ఇచ్చిన ప్రయోజనం లేదని వాపోతున్నారు. ‘దోమలతో తరచూ జ్వరాలు వస్తున్నాయి. ఖాళీ ప్లాట్లలోని నీరు వెళ్లేలా చర్యలు చేపట్టడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి’ అని కాలనీవాసి జంజిరాల సునీత కోరారు.

జంజిరాల సునీత